తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారైన కొడుకు

తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారైన కొడుకు
  • గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ లో ఘటన

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఇంద్రనగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యానికి బానిసై మానవత్వం మరచి కన్నతండ్రినే నిప్పంటించి చంపేశాడు. మంటల్లో కాలిపోతున్న తండ్రి ఇంట్లో నుంచి బయటపడకుండా తలుపు గొళ్లెం వేసి పరార్ అయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. 
గచ్చిబౌలి లోని ఇంద్రనగర్ లో నివసిస్తున్న నాగబాబు అనే వ్యక్తి  మద్యానికి బానిసగా మారాడు. తల్లి తండ్రులు కష్టపడి తెచ్చిన డబ్బులు బెదిరించి లాక్కొని మద్యం తాగి బలాదూర్ తిరిగేవాడు. తండ్రికి అనారోగ్యానికి గురై ఇంటి వద్దే ఉంటున్నాడు. మంగళవారం తనకు డబ్బుల కావాలని అడుగగా నిరాకరించిన తండ్రి దుర్గారావుపై వంట నూనె  పోసి నిప్పంటించాడు. అంతేకాదు మంటలతో కాలిపోతున్న తన తండ్రి దుర్గారావు ఇంట్లో చి బయటకు రాకుండా తలుపు గొళ్ళెం పెట్టి పారిపోయాడు. నాగబాబు ఇంట్లో నుంచి పొగ రావడంతో చుట్టుపక్కల వారు అనుమానంతో వచ్చి చూడగా మంటల నుంచి బయటపడేందుకు ప్రయత్నించి స్పృహ తప్పిన దుర్గారావు కనిపించాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.